తెలంగాణ భవన్ లో “కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు” అనే అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్-బీజేపీ నిస్సిగ్గుగా కుమ్మక్కై తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఇవాళ హరీష్ రావు గారు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింది.
పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు.. ఉద్యమ నినాదానికి పాతరేసి దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నారు.
అదే… బీఆర్ఎస్ పై నిందలు – కాంట్రాక్టర్ లతో దందాలు – ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు
గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ గారు కాలంతో పోటీపడి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు.
దశాబ్దాలపాటు సాగునీటి కోసం తండ్లాడిన రైతులకు నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన దార్శనికులు కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు శ్రీరామరక్ష.. కేసీఆర్
అనుమతి లేకుండా ఏపి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు.
గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది చనిపోయినా NDSA కానీ, ఏ ఏజెన్సీ కానీ ఇప్పటి దాకా నోరు మెదపలేదు.
బీహార్ లో నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలినా ఏ ఏజెన్సీ స్పందించదు.
సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలినా NDSA రాదు.
SLBC టన్నెల్ కుప్పకూలి 8 మంది చనిపోయినా NDSA విచారణ చేయదు.
వట్టేం పంపూహౌస్ మునిగినా, పెద్ద వాగు కొట్టుకుపోయినా NDSA రాదు.
కానీ కాళేశ్వరంలోని వంద కాంపోనెంట్లలో కేవలం ఒక్క చోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్దాంతం చేస్తున్నారు.
NDSA రిపోర్ట్ పేరిట బీజేపీ ఆఫీసులో NDA రిపోర్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ రిపోర్ట్ చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదని ఎల్ అండ్ టీ సంస్థ తేల్చి చెప్పింది.
పార్లమెంట్ నూతన భవనం కట్టిన ఎల్ అండ్ టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పంపిన మూటలతోనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కట్టుకుంది. దాన్ని కూడా ఎల్ ఎండ్ టీ సంస్థనే కట్టింది.
నమ్మకం లేకపోతే ఆ సంస్థతోనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం కట్టించారు.
కాంగ్రెస్-బీజేపీ కలిసి తెలంగాణ రైతుల బొండిగె పిసికే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వరకూ వెళ్లి వాస్తవాలు చెబుతాం.
మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలి.
V59 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *