*వెల్లుట్ల, అన్నసాగర్ గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఈరోజు వెల్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామాలలో ప్రతీ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి ఈ ఆరోగ్య కేంద్రాలు ముఖ్య భూమిక పోషిస్తాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.
తరువాత వైద్యులతో మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో DMHO, ANM, MLA, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు, వెల్లుట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *