కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామ శివారులో తిమ్మారెడ్డి కట్టకింద కి చెందిన ఇస్లావత్ రవి యొక్క 9 గొర్రెలు1 మేక అడవి రేస్ కుక్కల దాడిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు, ఇది మొదటిసారి జరిగిందని ఇలా ఎప్పుడు జరగలేదని తెలియజేశారు, దయచేసి ఈ రేస్ కుక్కల దాడి నుంచి ఫారెస్ట్ అధికారులు రక్షించాలని చుట్టుపక్కల గ్రామాల గొర్రెల మేకల కాపరులు, తెలిపారు. తొమ్మిది గొర్రెలు ఒక మేక ఆస్తి నష్టం సుమారుగా 95000 ఆస్తి నష్టం జరిగిందని ఇస్రావత్ రవి తెలియజేశారు.