V59 News Yellareddy: 08.07.2025 :
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుత ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, మల్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి నర్సింలుకు సంబందించిన ఇంటి కూల్చివేతకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఇల్లు కూల్చివేత పై మొసలి కన్నీరు కరుస్తున్నారని తెలిపారు. నర్సింలు కబ్జా స్థలంలో నివాసం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు సైతం సదరు వ్యక్తి కి అనేకమార్లు నోటీసులు ఇచ్చి కూల్చి వేయడం జరిగింది తప్పా. తమ పార్టీకి, ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదన్నారు. నర్సింలు విషయంలో చట్టం తన పని తను చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు సరికాదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. కార్యక్రమం లో నాయకులు మాజీ జడ్పీటీసీ సామెల్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, తిరుపతి, అజార్, ఆశమొల్ల సాయిబాబు, వహీద్, సంతోష్, నీల రవి, సుకెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.