Categories: Uncategorized

కామారెడ్డి వరద ప్రాంతాల్లో రోడ్లను పంటలను పరిశీలించిన సీఎం.

*ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ తో ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటన*

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో పర్యటించారు.

సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్ధ్ వంతెన (KKY హైవే) ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బుర్గిద్ద నందు రైతు పొలాలను పరిశీలించి, మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మొత్తం పరిస్థితిని సీఎం మరియు మంత్రులకు వివరించారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, వరదల సమయంలో జిల్లా అధికారుల కృషి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గారు వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు కావలసిన అన్ని వనరులను అందజేశారని తెలిపారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పొచారం ప్రాజెక్టు కూడా కలెక్టర్, SDRF బృందాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది (ప్రత్యేకంగా RDO & DSP), కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బృందం కృషితో కాపాడబడిందని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని సీఎం గారిని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 100 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాలు, వరదలు ఎప్పుడూ ఎల్లారెడ్డిలో చూడలేదని అన్నారు. *ఈ క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలను రక్షించారని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, ఎల్లారెడ్డి నియోజకవర్గం & కామారెడ్డి జిల్లా ప్రభుత్వ అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.*

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Recent Posts

లింగంపేట్ : (సర్పంచ్ )రిజర్వేషన్ జనరల్ కానీ, ఏకగ్రీవ ఎన్నిక….

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో  సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…

4 hours ago

ఎల్లారెడ్డి :  ఘనంగా శ్రీ  దత్తాత్రేయ జయంతి వేడుకలు..

ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ  దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…

1 day ago

TG : సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…..

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…

1 week ago

మహమ్మద్ నగర్ : డ్వాక్రా మహిళ సంఘాలకు చీరల పంపిణీ….

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…

2 weeks ago

ఎల్లారెడ్డి : గ్రామ సంఘం యాడ్ ఆధ్వర్యంలో మహిళా శక్తి చీరలు పంపిణీ….

ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…

2 weeks ago

TG: పైడి ఎల్లారెడ్డి జపాన్ పర్యటన లో  వ్యాపార ,వాణిజ్య CEO లతో సమావేశం……

డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…

2 weeks ago

This website uses cookies.