ఎల్లారెడ్డి నియోజకవర్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 80 కోట్లతో అభివృద్ధి పనులుప్రారంభించడం సంతోషమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామం నుండి వెల్లుట్ల తండా BT రోడ్ 1.70 కోట్ల నిధులతో, వెంకటాపూర్ గ్రామ BT రోడ్, 2.0 కోట్ల నిధులతో సోమార్యఘడ్ తండా BT రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం అయన ఎమ్మెల్యేమాట్లాడుతూ వెల్లుట్ల, వెల్లుట్ల తండా, వెంకటాపూర్, సోమార్యఘడ్ తండా గ్రామ ప్రజల చిరకాల కోరిక అయినా రోడ్ నిర్మాణం పనులు ఈరోజు ప్రారంభించడం చాల సంతోషంగా ఉంది అని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు & రైతులు భు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ లింగంపేట మండలం ఎంపిక చేసాం అని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ₹50 కోట్ల నిధులతో నూతన CC రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.